5, ఆగస్టు 2010, గురువారం

కోవెల సంపత్కుమార

కోవెల సంపత్కుమార
సాహిత్యం వెర్రితలలు వేస్తున్న కాలంలో కాలుజారకుండా నిలదొక్కుకున్న మనీషుల్లో సంపత్కుమార ఒకరు ..
భారతీయ జీవన మీమాంసను గ్రహించి గతంతో వర్తమాన భవిష్యతుల సామంజస్యాన్ని సాధించుకోవాలనే ప్రేరణ కలిగిన నిత్యసాధకుడు. ఏదో చేయాలనే తపన ఉండి దాన్ని గురించి నిర్దిష్టమైన ఆలోచన వ్యూహం కలిగిన సంపత్కుమార తారాపధంలో కలిసిపోయాడంటే నమ్మలేని నిజమ్.
ఒకప్పుడు వరంగల్లో ధూపాటి వెంకట రమణాచార్యులు, ఉదయరాజు శేషగిరిరావు.. ఆ తర్వాత హరిరాధాక్రిష్ణముర్తి, విశ్వనాథ వెంకటేశ్వర్లు.. ఇదే కోవకు చెందినా కోవెల ద్వయం .. సంపత్కుమార, సుప్రసన్న. వీళ్ళిద్దరూ నాకు రక్తసంబందికులే ఐన సాహిత్య పరంగా వీరితో అనుబంధం మరవరానిది,. ఎక్కువగా సుప్రసన్న పెద్దనాయనతో అనుబంధం ఉన్నప్పటికీ సంపత్తాతతో కేవలం సభానుబంధమే, తాతయ్య పుస్తకం రాసినప్పుడు సంపత్ తాత పంపిన ఆశీస్సులు మరింత బలాన్నిచ్చాయి. ఈరోజు సంపత్ తాత లేదంటే సాహితీ సంద్రం ముగబొఇనత్లెరాయడానికి మాటలు లేక ఆగిపోయిన పదాల నడుమ సంపత్ ధ్రువ తారకు నా స్మృత్యంజలి.